రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తు దారులతో కిక్కిరిసిపోయింది.లోక్ సభ ఎన్నికల కారణంగా దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది.
మంగళవారం ప్రజా పాలన వెబ్సైట్ ప్రారంభం కావడంతో.దరఖాస్తుల స్వీకరణ సంబంధిత అధికారులు ప్రారంభించారు.దీంతో ప్రజా పాలన దరఖాస్తుదారులు మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కట్టారు.