రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కోళమద్ది గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి సంబంధించిన నిధులు ఇవ్వడం లేదని మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావు గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు.
గ్రామపంచాయతీ భవనానికి సంబంధించిన 20 లక్షల రూపాయలు రావలసిఉందన్నారు.
పనిచేసినా మూడేళ్లు గా గౌరవ వేతనం రాలేదని,గ్రామ అభివృద్ధికి వెచ్చించిన దాదాపు 8 లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉందని ప్రభుత్వం వెంటనే బిల్లులు ఇప్పించాలని మాజీ సర్పంచ్ కేశవరావు అధికారులను కోరారు.







