బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని వివిధ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను బిజెపి నాయకులు శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోహిణి కార్తె సమీపిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.
ఇప్పటికైనా ఈ ప్రభుత్వం లారీలు పంపి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
అకాల వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్ద అయిపోతుందని శరవేగంగా కొనుగోలను చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పోన్ చెట్టి రాకేష్, మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట గంగాధర్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యాయులు పేరుక గంగారాజ్ ,మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చింతకుంట సాగర్,బూత్ అధ్యక్షులు పెరిక రంజిత్, సిర్రం తిరుపతి,లోకోజి సతీష్, పత్తిపాక శ్రీనివాస్,దురిశెట్టి రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.







