వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి కొనసాగుతోంది.కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి, బీజేపీ నేత ఆరూరి రమేశ్ ( Kadiam Srihari , Aruri Ramesh )మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ క్రమంలోనే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యపై ఆరూరి రమేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కడియం తనకు వెన్నుపోటు పొడిచారన్న ఆరూరి రమేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి కడియం శ్రీహరినే కారణమని ఆరోపించారు.
అక్రమ ఆస్తులను కాపాడేందుకు కడియం పార్టీ మారారని ఆరూరి పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ఆరూరి రమేశ్ కు కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
తనపై ఆరోపణలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ చేశారు.ప్రస్తుతం వీరిద్దరి మధ్య విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.