ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.ఈ మేరకు కవిత బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారించనుంది.
తన చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం ఈ నెల 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ లో కోర్టును కోరారు.ఈ క్రమంలోనే గత నెల 26న ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో కవిత తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.
అయితే కవితకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ ను ఈడీ( ED ) వ్యతిరేకిస్తుంది.కవిత బెయిల్ పై బయటకు వస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ పేర్కొంది.సాక్షులను, ఆధారాలను ఆమె ప్రభావితం చేస్తారని ఈడీ ఆరోపిస్తుంది.
కాగా ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.