ఈ మధ్యకాలంలో కొందరు సోషల్ మీడియా( Social Media )లో ఫేమస్ కావడానికి నానా తంటాలు పడుతూ.చేయరాని పనులు చేస్తూ.
తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు.ఇకపోతే తాజాగా హోలీ పండగ పురస్కరించుకొని కొందరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే బైక్ పై అసభ్యకరమైన చర్యలకు పాల్పడినందుకు పోలీసులు వారికి రూ.24,500 జరిమానా విధించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో యువతీ యువకుల బృందం హోలీ( Holi Celebration )ని జరుపుకున్న తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.నోయిడా( Noida ) లోని ఓ ప్రాంతంలో ఒకే బైకుపై ఇద్దరమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిసి హోలీ సందర్భంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నారు.
అయితే ఇలా వెళ్తున్న సమయంలో నలుగురు ఒకే బైక్ పై ప్రయాణించడమే కాకుండా.ఓ వ్యక్తి షర్ట్ వేసుకోకుండా ఉన్నాడు.వారు బైక్ మీద వెళ్తున్న సమయంలో చివరగా కూర్చున్న వ్యక్తి ముందు ఉన్న అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న సమయంలో వెనుకల వస్తున్న కారులో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దాంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ వీడియో చివరికి సదరు ప్రాంత ట్రాఫిక్ పోలీసులకు చేరగా.వారు బైక్ పై ప్రయాణించిన వారిపై ట్రాఫిక్ నిబంధనల( Traffic Rules ) మేరుగా భారీ జరిమానా విధించారు.నేపథ్యంలో వారికి రూ.24500 లు ఫైన్ గా వారికి విధించారు.కాబట్టి ఏదైనా పని చేసే ముందు ఎక్కడ ఉన్నాము.ఏం చేస్తున్నాము.అనే విషయాలు గ్రహించి పనులు చేస్తే ఇలాంటివి ఎదురుకాకుండా చూసుకోవచ్చు.







