Kadapa District : కడప జిల్లాలో విషాదం..ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం

ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.తమ భూమి ఆన్ లైన్( Land Online ) లో ఇతరుల పేరు మీద ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడింది.

 Kadapa District : కడప జిల్లాలో విషాదం..ఒక-TeluguStop.com

ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఈ దారుణం జరిగింది.కాగా స్థానిక ఎమ్మార్వో లంచం తీసుకుని తమ భూమిని ఆన్ లైన్ చేయలేదంటూ సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మార్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు.కాగా సుబ్బారావు రైలు కిందపడి బలవన్మరణం చెందగా.

ఆయన సతీమణి, కుమార్తె ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు( police ) ఘటనాస్థలాన్ని పరిశీలించారు.అనంతరం ఆత్మహత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలోనే సుబ్బారావు పెద్ద కుమార్తె హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube