ఇందుగుల విష జ్వరాలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో విస్తరిస్తున్న విషజ్వరాలపై పత్రికల్లో వచ్చిన వార్తలపై శుక్రవారం రాష్ట్ర రోడ్లు,భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు.వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ ఆర్.

 Minister Komatireddy Responded To The Poisonous Fever Of Indigo , Indigo, R.v. K-TeluguStop.com

వీ.కర్ణన్ తో మాట్లాడి వెంటనే సీనియర్ వైద్య బృందాన్ని ఇందుగుల గ్రామానికి పంపించి గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఒక్క ఇందుగుల మాత్రమే కాకుండా మండలంలో అన్ని గ్రామాలకు వైద్యులను పంపించి పరిస్థితిని సమీక్షించాలన్నారు.వేసవి కాలంలోఎండలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో విషజ్వరాల బారినపడినట్లయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని మంత్రి కమీషనర్ దృష్టికెళ్ళారు.

తక్షణం వైద్య బృందాన్ని పంపి రోజువారి నివేదికను ఇవ్వాలని కమీషనర్ ను కోరారు.ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఆర్ధికంగా చితికిపోకుండా అందరికి ప్రభుత్వమే మెరుగైన వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు.

పరిస్థితి కుదుటపడేవరకు అక్కడ నిత్యం వైద్య సేవలు అందించాలని ఆదేశాలు ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube