హెచ్ఎండీఏ కృష్ణకుమార్ కేసు( HMDA Krishna Kumar Case )లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.శివబాలకృష్ణ, కృష్ణకుమార్ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే.
కాగా కృష్ణ కుమార్ ను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది.హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ బీవీ కృష్ణకుమార్( HMDA Assistant Planning Officer BV Krishnakumar ) అక్రమాలు బయటకు వచ్చాయని తెలుస్తోంది.
కృష్ణకుమార్ బిల్డర్లతో కుమ్మక్కై ప్రభుత్వానికి రూ.వేల కోట్ల నష్టం చేశారని అధికారులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వానికి సుమారు రూ.3,800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది.ఈ క్రమంలోనే మరో ఇద్దరు హెచ్ఎండీఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ( ACB Officials ) ఆరా తీస్తోంది.కాగా శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేయడంతో కృష్ణ కుమార్ విదేశాలకు వెళ్లారని సమాచారం.







