ఇష్క్ సినిమాతో డైరెక్టర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్న విక్రమ్ కే కుమార్( Vikram K Kumar ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆ సినిమా ఇచ్చిన హిట్టుతో నాగార్జునతో మనం( Manam Movie ) అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే విక్రమ్ కే కుమార్ ఇష్క్ సినిమా కంటే ముందే నాగార్జునకి( Nagarjuna ) మనం స్టోరీని చెప్పారట.ఆ స్టోరీ నాగార్జునకి విపరీతంగా నచ్చింది.
కానీ విక్రమ్ కుమార్ దాన్ని హ్యాండిల్ చేస్తాడా లేదా అనే డౌట్ తో ఆ స్టోరీని నాగార్జున నాకు ఇచ్చేయ్ నేను వెరే వాళ్ళతో డైరెక్షన్ చేయిస్తాను అని చెప్పారట.
దానికి మాత్రం విక్రమ్ కుమార్ అసలు ఒప్పుకోలేదట.మరి ఎలా అని డైలమాలో పడ్డ ఆ నిమిషంలో ఒక చిన్న స్టోరీని తయారు చేసుకొని నితిన్( Nithin ) దగ్గరికి వెళ్ళి ఇష్క్( Ishq ) అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక ఆ తర్వాత నాగార్జున పిలిచి మరి మనం సినిమా చేసే అవకాశం అయితే ఇచ్చాడు.
అలా వీళ్ళిద్దరి కాంబోలో ఈ సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత నాగచైతన్య, అఖిల్ తో మరిన్ని సినిమాలు చేసి వాళ్ళ ఫ్యామిలీ డైరెక్టర్ గా ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ సినిమాల పరంగా కొంచెం వెనుకబడి ఉన్నాడు.నాగచైతన్యత చేసిన దూత వెబ్ సిరీస్( Dhootha Web Series ) సక్సెస్ అయినప్పటికీ ఆయనకు సినిమాల పరంగా అవకాశాలు అయితే రావడం లేదు…ఇక తొందర్లోనే మరో మంచి సబ్జెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు గా తెలుస్తుంది…
.