ఏపీలో వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు.ఇడుపులపాయలో ఈ ప్రకటన చేస్తుండగా సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం జగన్( CM Jagan ) సీట్ల కేటాయింపు చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు( Dharmana Prasada Rao ) అన్నారు.

ఈ క్రమంలో 25 పార్లమెంట్ సీట్లలో ఎస్సీలకు నాలుగు, ఎస్టీలకు ఒకటి, బీసీలకు 11 సీట్లు మరియు ఓసీలకు 9 సీట్లను కేటాయించినట్లు తెలిపారు.అసెంబ్లీ మరియు లోక్ సభ స్థానాలైన మొత్తం 200 స్థానాల్లో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు వంద సీట్లు కేటాయింపు జరిగిందని వెల్లడించారు.2019 లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొత్తం 89 సీట్లు కేటాయించగా.ఈ సారి ఎన్నికల్లో 11 సీట్లు అదనంగా పెంచి వంద సీట్లు వారికి కేటాయించారని తెలిపారు.







