ఏపీ బీజేపీ( AP BJP )లో పొత్తుల లొల్లి మొదలైంది.ఈ మేరకు పొత్తులపై పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా గళం విప్పుతున్నారు.
పొత్తుల నేపథ్యంలో బీజేపీ అడుగుతున్న సీట్లపై ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండానే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) అభ్యర్థులను ప్రకటించారని బీజేపీ సీనియర్లు మండిపడుతున్నారు.

గతంలో టీడీపీ( TDP ) ఓడిపోయిన సీట్లను ఇప్పుడు బీజేపీకి కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వానికి బీజేపీ రాష్ట్ర సీనియర్ నేతలు లేఖ రాశారు.ఈ లేఖలో సుమారు 16 మంది సంతకాలు చేశారని తెలుస్తోంది.
గుంటూరు వెస్ట్, కదిరి మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ సీట్లను బీజేపీ ఆశించినప్పటికీ టీడీపీనే తీసుకుందని మండిపడ్డారు.







