జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ ( Medigadda Barrage )వద్దకు ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం చేరుకుంది.చంద్రశేఖర్ అయ్యర్( NDSA Chandrasekhar ayyar ) కమిటీ బ్యారేజ్ ను పరిశీలిస్తోంది.
ఈ మేరకు ఏడవ బ్లాక్ లోని 18, 19, 20 మరియు 21 పిల్లర్లతో పాటు పగుళ్లు తేలిన ప్రాంతాన్ని నిపుణులు బృందం నిశితంగా పరిశీలిస్తోంది.కమిటీ వెంట రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు ఉన్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే కమిటీ అడిగిన ప్రతి ప్రశ్నకు అధికారులు సమాధానం ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy )కీలక ఆదేశాలు జారీ చేశారు.మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన అనంతరం ఎన్డీఎస్ఏ నిపుణులు బృందం అన్నారం బ్యారేజీ పరిశీలనకు వెళ్లనుంది.







