ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అనంత అంబానీ రాధికా మర్చంట్ ల ఫ్రీ వెడ్డింగ్ వేడుక గురించే చర్చించుకుంటున్నారు.తాజాగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుకకు దేశ విదేశ ప్రముఖులతో పాటు చాలామంది సినీ ప్రముఖులు కూడా పాల్గున్నారు.ఈ వేడుకలో అంబానీ కుటుంబంతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
అంబానీ ఇంట జరిగిన వేడుకలో ఆనందంగా పాల్గొన్నారు షారుఖ్ఖాన్, సల్మాన్ఖాన్, ఆమీర్ఖాన్( Shah Rukh Khan, Salman Khan, Aamir Khan ) .ఈ ముగ్గురూ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి నాటు నాటు పాటకు వేసిన స్టెప్పులు వైరల్ అయ్యాయి.
ఆ వేడుకలో వారితో పాటు స్టేజ్ మీద టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్( Ramcharan ) కూడా కాలు కదిపారు.ఇందుకు గానూ ఈ బడా స్టార్లు ఎంత చార్జి చేశారో తెలుసా? అంటూ నార్త్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్నది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.అంత వైభవంగా జరిపిన వేడుకకు ఆహ్వానం అందడమే గొప్పగా భావించారు సెలబ్రిటీలు( Celebrities ) .వైభవంగా జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గున్న సినిమా స్టార్ హీరోస్, ప్రముఖులు అంతా కూడా వారి ఇష్ట పూర్వకంగానే కాలు కదిపారే తప్ప, ఏదో డబ్బు కోసం ఎవ్వరు చెయ్యలేదు అన్నది ప్రముఖుల్లో గట్టిగా వినిపిస్తున్న మాట.
రామ్ చరణ్ కూడా సరదాగానే స్టెప్పులు వేశారట.ముగ్గురు ఖాన్లూ, చరణ్ వేసిన స్టెప్పులు వైరల్ కావడంతో వెంటనే ఎంత తీసుకున్నారు? ఎంత ఇచ్చి ఉంటారనే మాటలు వినిపిస్తున్నాయి.అసలు ఆ మాటలకు అర్థం లేదంటూ కొట్టిపారేస్తున్నారు నార్త్ క్రిటిక్స్.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.