35 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

నల్లగొండ జిల్లా:త్రిపురారం మండల కేంద్రంలో శ్రీ శ్రీనివాస రైస్‌ మిల్‌లో పీడీఎస్‌ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడకు వెళ్లి తనిఖీ చేసి,అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.అదే రైస్ మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్న మండల కేంద్రానికి చెందిన యాదయ్య అక్రమంగా నిల్వ చేసిన సుమారు 35 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 Harvesting Of 35 Quintals Of Pds Rice , Pds Rice, Sri Srinivasa Rice Mill, 35 Qu-TeluguStop.com

ఈ విషయాన్ని సివిల్‌ సప్లయ్‌ అధికారులకు సమాచారం అందించి, యాదయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపారు.అంతే కాకుండా మండలపరిధిలో అక్రమంగా ఎవరైనా పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసినా, తరలించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ రవి, వెంకటేశ్వర్లు,రమేష్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube