విశాఖలోని మధురవాడలో చోటు చేసుకున్న ఫొటోగ్రాఫర్ సాయి హత్య కేసులో చిక్కుముడి వీడుతుంది.కెమెరా కోసమే సాయిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని తెలుస్తోంది.
సాయిని హత్య చేసేందుకు నిందితుడు షణ్ముఖ్ కు అతని స్నేహితుడు సహకరించాడని పోలీసులు వెల్లడించారు.నిందితులు కూడా ఫొటో గ్రాఫర్సే కావడంతో అనుమానాలు నిజం అయ్యాయి.
ఈ క్రమంలో కేసుపై దర్యాప్తు చేస్తున్న పీఎం పాలెం పోలీసులు షణ్ముఖ్ తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు.







