కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత 40 ఏళ్లలో దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉందన్నారు.పాకిస్థాన్ తో పోలిస్తే భారత్ లో నిరుద్యోగం రెండింతలుగా పెరిగిందని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్, భూటాన్ కంటే భారత్ లోనే నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారని చెప్పారు.నోట్ల రద్దు, జీఎస్టీ అమలు ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేసిందని ఆరోపించారు.