నిండు జీవితానికి రెండు చుక్కలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలియో రహిత సమాజం కోసం మార్చి 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో 394 పోలియో బూతులను జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుండి ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత( Dr Rajitha ) తెలిపారు.

జిల్లాలో 5 సంవత్సరాలలోపు ఉన్న 44,770 పిల్లలు అందరూ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని కోరారు.

అందుకోసం తల్లిదండ్రులు అందరూ అప్పుడే పుట్టిన పిల్లవాని నుంచి ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు( Polio drops ) వేయించాలని అన్నారు.

ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి - జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

Latest Rajanna Sircilla News