ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సమంత( Samantha )కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు.ఏ మాయ చేసావే సినిమా నుంచి ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.
తమిళంలో, హిందీలో కూడా నటిస్తూ ఆకట్టుకుంటోంది.సమంత లుక్స్ మాత్రమే కాదు యాక్టింగ్ కూడా అదిరిపోతుంది.
ఈ కుందనపు బొమ్మ ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా ఒదిగిపోతుంది.ఆమె యాక్టింగ్ చాలా నేచురల్( Natural Acting ) గా అనిపిస్తుంది.
నిజానికి సమంత ఏడ్చే సీన్లలో గ్లిజరిన్ అస్సలు వాడదట.ఏడుపు వచ్చేంతవరకు అలానే ఆమె సన్నివేశం చేయకుండా ఉంటుందంట.
ఆ తర్వాత ఏడ్చేసి నేచురల్ గా నటించడం మొదలు పెడుతుందట.ఓ బేబీ సినిమా( Oh Baby Movie )లో సమంత కన్నీళ్లు పెట్టుకునే ఒక సన్నివేశం ఉంటుంది.
అది లాస్ట్ లో వస్తుంది.
అయితే ఆ సీన్ కోసమై ఆమె ఏడుపు తెచ్చుకోవడం కోసం రెండు గంటల పాటు షూటింగ్ ఆపేసిందట.బాగా ఎమోషనల్ అయి నేచురల్ గా ఏడుపొచ్చినప్పుడు ఆ సన్నివేశం చేసిందట.నిజానికి ఏ మాయ చేసావే సినిమాతోనే సమంత మూవీ సన్నివేశాల కోసం సహజంగా ఏడవటం నేర్చుకుంది.
ఏ మాయ చేసావే సినిమా( Ye Maaya Chesave )లో హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉంటాయి.వాటిలో మాట్లాడుతూనే సమంత ఏడ్చేస్తుంది.
అయితే ఒక మంచి ఎమోషనల్ కన్వర్జేషన్ నడుస్తున్నప్పుడు మధ్యలో షూటింగ్ ఆపేసి ఆమె కళ్ళల్లో గ్లిజరిన్( Glycerin ) వేసి ఏడుపు తెప్పిస్తే అది ఆర్టిఫిషియల్ సీన్ గా కనిపించే అవకాశం ఉంది.రెండు, మూడు టేకులు తీసుకున్నా ఆ సన్నివేశం లోని ఫీల్ పోయే అవకాశం ఉంది.
అందుకే డైరెక్టర్ గౌతమ్ మీనన్ సింగిల్ షాట్ లో సన్నివేశం మొత్తం రావాలని అనుకునేవారు.
ఆ సమయంలోనే సమంత ఎమోషనల్ సన్నివేశాల్లో సహజంగా ఏడవటం నేర్చుకుంది.అదే ప్రతి ఎమోషనల్ సన్నివేశాల్లో ఫాలో అవుతూ వస్తోంది.ఏది ఏమైనా ఎలాంటి పాత్రలోనైనా 100% జీవించడానికి సమంత ట్రై చేస్తూ అందర్నీ మెప్పిస్తోంది.
ఇక ఇటీవలే ఈ తార ఖుషి సినిమా( Khushi )తో మెప్పించింది.ఈ మూవీలో సమంత లుక్స్ అదిరిపోయాయి అని చెప్పుకోవచ్చు.ఆమె యాక్టింగ్ కూడా చాలామందిని ఆకట్టుకుంది.ప్రస్తుతం సామ్ సినిమాలో నుంచి బ్రేక్ తీసుకొని మయో సైటీస్ వ్యాధిని అధిగమించే ప్రయత్నాలు చేస్తోంది.
సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సోషల్ మీడియాలో మాత్రం తరచుగా ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లోనే ఉంటుంది.