దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం చేపట్టాలని పెద్ద ఎత్తున హీరో విశాల్( Vishal ) నిధులను సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.2019 వ సంవత్సరంలో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా 2022వ సంవత్సరంలో ఫలితాలను వెల్లడించారు.ఈ సంఘం అధ్యక్షుడిగా నాజర్ జనరల్ సెక్రెటరీగా విశాల్, ట్రెజరర్ గా హీరో కార్తీ( Karthi ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ అసోసియేషన్ భవనం నిర్మించడం కోసం పెద్ద ఎత్తున నిధుల కొరత ఏర్పడిందని గతంలో విశాల్ తెలిపారు.
ఇక ఈ భవనం నిర్మించడం కోసం నిధులను సమ కూర్చో పనిలో ఉన్నారు.
గత మూడు సంవత్సరాల నుంచి ఈ భవనం నిర్మించడానికి ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో 25% పనులు కూడా పెరిగాయని అదేవిధంగా డబ్బు కూడా ఎక్కువ అవుతుందని తెలిపారు.ఇక ఈ భవనం నిర్మించడం కోసం బ్యాంకులో రుణం కూడా తీసుకోబోతున్నాము అంటూ ఓ సందర్భంలో విశాల్ ( Vishal) వెల్లడించారు.ఇలా ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని పెద్ద ఎత్తున నడిగర్ సంఘం ( Nadighar Sangham ) సభ్యులు కష్టపడుతున్నటువంటి తరుణంలో వారికి అండగా సినీ నటుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అండగా నిలిచారు.
భవన నిర్మాణం పూర్తి చేయాలని ఉదయ నిది స్టాలిన్ ( Udaynidhi stalin )ట్రెజరర్ గా ఉన్నటువంటి హీరో కార్తీ కు ఏకంగా కోటి రూపాయల చెక్ అందించారు.ఈ విధంగా ఉదయ నిది స్టాలిన్ కోటి రూపాయల చెక్క అందించడంతో ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రియమైన ఉదయ్ ఈ భవన నిర్మాణం కోసం ఇలా కోటి రూపాయలు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు సహ నటుడిగా నిర్మాతగా స్నేహితుడిగా క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలిపారు.