Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం

తెలంగాణ అసెంబ్లీలో నీటి పారుదల రంగంపై కాంగ్రెస్( Congress ) ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.అలాగే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.

 Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో నీ-TeluguStop.com

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు.

గతంలో నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు.

గతం కంటే ఈ పదేళ్ల కాలంలో నదీ జలాల విషయంలో మరింత నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు.పోతిరెడ్డిపాడు( Pothireddy Padu ) సామర్థ్యాన్ని పెంచి నీటిని ఏపీకి తరలించారని ఆరోపించారు.తెలంగాణకు రావాల్సిన నీటిని ఏపీ పాలకులు తరలించుకున్నారని మండిపడ్డారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గత కాంగ్రెస్ పాలనలో 727 టీఎంసీలు నీరు వెళితే బీఆర్ఎస్ పాలనలో 1200 టీఎంసీలు తరలించారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube