ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆయన హస్తినకు పయనం కానున్నారు.
పర్యటనలో భాగంగా సీఎం జగన్ రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
అయితే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) నిన్న అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయిన సంగతి తెలిసిందే.పర్యటనను ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్ కు బయలు దేరగా.సాయంత్రం సీఎం జగన్ ఢిల్లీకి పయనం కానున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు, సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలతో ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.