టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మ్యూజిక్ డైరెక్టర్లలో మణిశర్మ( Mani Sharma ) ఒకరు.మణిశర్మ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉండగా ప్రస్తుతం పరిమిత సంఖ్యలో సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
స్టార్ హీరోలు తనకు ఎక్కువగా ఛాన్స్ ఇవ్వడం లేదని మణిశర్మ కొంతకాలం క్రితం ఆవేదన వ్యక్తం చేశారు.మంచి ఆఫర్ వస్తే పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని మణిశర్మ ఫీలవుతున్నారని సమాచారం.
మణిశర్మ వయస్సు 59 సంవత్సరాలు కాగా తాజాగా ఒక షోకు హాజరైన మణిశర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నేను మొదట వయొలిన్ నేర్చుకున్నానని ఆ తర్వాత పెద్దదిగా కనిపించిందని కీబోర్డ్ నేర్చుకున్నానని ఆయన అన్నారు.
ఆ తర్వాత అనంత శ్రీరామ్( Ananta Sriram ) మణిశర్మతో మీకు పాట నచ్చకపోతే స్పీకర్ బాక్స్ లు పగలగొడతారట కదా అని ప్రశ్నించగా ఆ థమన్ గాడు( Thaman ) అబద్ధం చెప్పాడని మణిశర్మ అన్నారు.
నా జీవితంలో ఒక్కసారి మాత్రమే అలా చేశానని మణిశర్మ కామెంట్లు చేశారు.నా సినీ కెరీర్ లో ఎంతోమంది సెలబ్రిటీలతో కలిసి పని చేశానని వాళ్లతో కలిసి పని చేయడం తన లక్ అని ఆయన అన్నారు.షో చివర్లో మణిశర్మకు సన్మానం చేయడం గమనార్హం.
మణిశర్మ శిష్యుడైన థమన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీగా ఉన్నారు.
థమన్ రెమ్యునరేషన్( Thaman Remuneration ) ఒకింత భారీ రేంజ్ లో ఉంది.థమన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు పని చేస్తుండగా ఆ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.థమన్ మ్యూజిక్ విషయంలో కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలో తర్వాత ప్రాజెక్ట్ లతో థమన్ ఆ విమర్శలకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
రాజాసాబ్( Rajasaab ) సినిమాకు ప్రస్తుతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు.