రాజన్న సిరిసిల్ల జిల్లా: రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో కోరుట్ల బస్టాండ్ లో వాహనాలు తనిఖీని నిర్వహించారు.ఇందులో భాగంగా హెల్మెట్ ధరించిన వారికి గులాబీ పువ్వులు ఇచ్చి అభినందించారు.
హెల్మెట్ ధరించని వాహనదారులకి జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా టౌన్ సీఐ పీ కరుణాకర్ మాట్లాడుతూ వాహనదారులు కచ్చితంగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని వారి గమ్యానికి క్షేమంగా చేరాలని తెలిపారు.
వెహికల్ చెకింగ్ లో ఆర్ఎస్ఐ దిలీప్, సిబ్బంది పాల్గొన్నారు.