పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ టికెట్ల( Telangana Congress MP Tickets ) ఆశావహులను గుర్తించే పనిలో పడింది.ఈ మేరకు ఇవాళ నేతల పేర్లను డీసీసీ అధ్యక్షులు పీసీసీకి పంపనున్నారు.
కాగా రేపు హైదరాబాద్ లోని గాంధీభవన్( Gandhi Bhavan ) లో కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది.

ఈ క్రమంలో ఎంపీ టికెట్లను ఆశిస్తున్న నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనున్నారు.అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనుంది.అనంతరం ఆ పేర్లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ( Congress Central Election Committee )కి సిఫారసు చేయనున్నారు.
కాగా వచ్చే నెల 5, 6 తేదీల్లో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది.పీఈసీ పంపిన జాబితాపై కేంద్ర కమిటీ చర్చించనుంది.తరువాత ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.







