ఏపీ సీఎం వైఎస్ జగన్( AP CM YS Jagan ) బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు జయరామ్ డుమ్మా కొట్టారు.అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు( Minister Gummanur ) గైర్హాజరు అయ్యారు.
టికెట్ విషయంలో అసంతృప్తిగా ఉన్న మంత్రి గుమ్మనూరు మొదటిసారిగా సీఎం జగన్ సభకు డుమ్మా కొట్టారు.శ్రీ సత్యసాయి జిల్లాకు గుమ్మనూరు ఇంఛార్జ్ మంత్రి గా ఉన్న సంగతి తెలిసిందే.

గతంలో కర్నూలుతో పాటు అనంతపురం ఉమ్మడి జిల్లాల్లోని సీఎం జగన్ సభలకు ఆయన హాజరైన సంగతి తెలిసిందే.అయితే ఆలూరు టికెట్ విషయంలో వైసీపీ( YCP ) అధిష్టానంపై గుమ్మనూరు తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మంత్రి గుమ్మనూరు గైర్హాజరు వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.







