విజయవాడ ఎంపీ కేశినేని నాని( Vijayawada MP Kesineni Nani )పై టీడీపీ నేత కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు.కేశినేని నాని దేవినేని అవినాశ్ కు ముఖ్య అనుచరుడని ఆరోపించారు.
కేశినేని నానికి బుద్ది చెప్పడానికి విజయవాడ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేశినేని చిన్ని( Kesineni Chinni ) తెలిపారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీని ఖాళీ చేయడం కేశినేని నాని వలన కాదని చెప్పారు.

కేశినేని నాని వైసీపీ( YCP )లోకి వెళ్లిన తరువాత నాని వెంట ముగ్గురు కూడా లేరని విమర్శించారు.ఈ క్రమంలోనే తాము గేట్లు తెరిస్తే వరదలా రావడానికి వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.రాష్ట్రంలో కొనసాగుతున్న దుష్టపాలన అంతమొందించడమే చంద్రబాబు( Chandrababu ) లక్ష్యమని స్పష్టం చేశారు.







