హిమచల్ ప్రదేశ్ లో ని సిమ్లాలో( Shimla ) కొండచరియలు విరిగిపడ్డాయి.దీంతో ఐదంతస్థుల భవనం( Five-Storey Building ) ఒక్కసారిగా కుప్ప కూలింది.
అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కాగా ఈ భవనానికి సమీపంలో ఉన్న లా కాలేజీ బిల్డింగ్ లో కొంత భాగం ధ్వంసం కాగా చుట్టుపక్కల పగుళ్లు ఏర్పడ్డాయి.అయితే కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో ముందే అప్రమత్తమైన అధికారులు భవనంలోని వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు.దీంతో ప్రాణాపాయం తప్పింది.