సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
ప్రస్తుతం తమ్మినేనికి ఐసీయూలో ఏఐజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.నిన్నటితో పోలిస్తే ఇవాళ ఆరోగ్యం కాస్త మెరుగ్గా ఉందని చెబుతున్నారు.
బీపీ లెవల్స్ నార్మల్ గా ఉన్నాయంటున్న వైద్యులు ఊపిరితిత్తుల్లో నీరును తొలగిస్తున్నామని తెలిపారు.అయితే గుండె, కిడ్నీ మరియు ఊపిరితిత్తుల సమస్యతో తమ్మినేని వీరభద్రం బాధపడుతున్నారు.
ఈ క్రమంలో ఇవాళ ఆరోగ్యం నిలకడగా ఉంటే వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.







