తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మన టాప్ డైరెక్టర్లు అయిన కొంతమంది డైరెక్టర్లు ఒక్క సినిమాకోసం ఎంత రేమ్యూన్ రేషన్ ని తీసుకుంటున్నారు అనే విషయాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ముఖ్యంగా రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ ( Rajamouli, Trivikram, Sukumar, Koratala Siva ) లాంటి డైరెక్టర్లు ఎంత మొత్తంలో రెమ్యూన్ రేషన్ ని ఛార్జ్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ముందుగా రాజమౌళిని తీసుకుంటే రాజమౌళి బాహుబలి లాంటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చాటుకున్నాడు.
ఒక్క సినిమా కోసం రాజమౌళి దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూన్ రేషన్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది.అయితే రాజమౌళికి అంత మొత్తంలో రెమ్యూన్ రేషన్ ( Remuneration ) ఇవ్వడంలో కూడా తప్పులేదు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి.కాబట్టి రాజమౌళికి ఎంత ఇచ్చిన తక్కువే అవుతుంది అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇక రాజమౌళి తర్వాత సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సినిమాతో తన సత్తా ఏంటో చాటుకున్నాడు.ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరొకసారి పాన్ ఇండియా ప్రేక్షకుల్ని మంత్రం ముగ్ధుల్ని చేయడానికి మన ముందుకు రాబోతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పుష్ప 2 సినిమా కోసం దాదాపు 70 కోట్ల వరకు డబ్బులను రెమ్యున్ రేషన్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఈయన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకైతే కదులుతున్నాడు.ఇక ఈయన మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా కోసం దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూన్ రేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక వీళ్ళ ముగ్గురి తర్వాత ఎన్టీఆర్ తో దేవర సినిమా చేస్తున్న కొరటాల శివ కూడా మంచి డైరెక్టర్ గా చాలా పాపులారిటిని సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియాలో మరొకసారి తన సత్తా ఏంటో చూపించుకోబోతున్నాడు.కొరటాల శివ దేవర సినిమాకి 40 కోట్ల వరకు రెమ్యూన్ రేషన్ ని ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…
.







