యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం యువకులు కనుమరుగవుతున్న క్రీడలకు ప్రాణం పోస్తూ, క్రికెట్ ని అభిమానించే యువకులు నేడు క్రీడలకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని గమనించి ఆర్గనైజర్ ఉప్పల నాగరాజు ముందుకొచ్చి ప్రతి సంక్రాంతి పండుగకు యువత తప్పుదోవ వెళ్లకుండా ఉండాలని నిర్ణయం తీసుకొని ఎస్.ఎన్.పి.ఎల్ అనే గ్రూప్ ఏర్పాటు చేసి సంక్రాంతి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు.
యాభై టీమ్స్ దాకా ఫోన్ నెంబర్స్ ద్వారా వారికి సమాచారం అందించి ఆటస్థలానికి విచ్చేయాలని సూచిస్తారు.పది మంది ఆర్గనైజర్లుగా ఉండి వారం రోజుల పాటు ఈ క్రీడలు నడిపిస్తారు.
దీనికి ముఖ్య అతిథులుగా పలువురిని ఆహ్వానించి ఆటలు ప్రారంభించి, బహుమతి ప్రధానోత్సవం రోజు కూడా వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేస్తారు.యువకులను ఒక్కదగ్గరకి చేర్చి క్రికెట్ పై ఆసక్తి పెంచుతూ యువకులు చేస్తున్న పనికి ప్రజలంతా శభాష్ అంటున్నారు.







