ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Johnny master ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు.
జానీ మాస్టర్ కొరియోగ్రఫీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ఈ మధ్య కాలంలో పొలిటికల్ కామెంట్లు చేయడం ద్వారా జానీ మాస్టర్ వార్తల్లో నిలిచారు.
అయితే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు శవాల దగ్గర ఒకప్పుడు జానీ మాస్టర్ కాటికాపరిగా పని చేశారు.
ఒక యూట్యూబ్ ఛానల్( YouTube channel ) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానీ మాస్టర్ మాట్లాడుతూ ఆర్జీవీతో నాకు మంచి రిలేషన్ ఉందని ఆయన వెల్లడించారు.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )రియల్ లైఫ్ లో ఇష్టమని పొలిటికల్ గా కూడా ఇష్టమని ఆయన అన్నారు.
నేను జనసేన టికెట్ తీసుకుంటానో లేదో వాళ్లే అధికారంగా చెబితే బాగుంటుందని జానీ మాస్టర్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ సహాయం చేసినా ఆ సహాయం గురించి చెప్పుకోరని జానీ మాస్టర్ వెల్లడించారు.నేను చేసిన సాయం గురించి ప్రచారం చేసుకోనని జానీ మాస్టర్ అన్నారు.మా నాన్న లారీ డ్రైవర్ అని ఆయన పేర్కొన్నారు.
నేను పూరి గుడిసెలో పుట్టానని జానీ మాస్టర్ వెల్లడించారు.లారీ మెకానిక్ గా కూడా నేను పని చేశానని జానీ మాస్టర్ పేర్కొన్నారు.
నేను బేలుదారీ పని కూడా చేశానని ఆయన కామెంట్లు చేశారు.
30 రూపాయల కోసం ధాన్యానికి కాపలా ఉన్న రోజులు కూడా ఉన్నానని జానీ మాస్టర్ కామెంట్లు చేశారు.నేను కాలి లేచిన శవాలను సైతం కొట్టానని రెండు రూపాయలు, మూడు రూపాయలు ఇచ్చారని జానీ మాస్టర్ తెలిపారు.జానీ మాస్టర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.