టీడీపీ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలో సీఎం జగన్ అన్ని రంగాల్లో విఫలం అయ్యారని చెప్పారు.
సీఎంగా ఆయన సాధించిందేమీ లేదని ఆరోపించారు.
జగన్ పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని ఎంపీ కేశినేని నాని తెలిపారు.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమన్న ఆయన టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అలాగే విజయవాడ పార్లమెంట్ స్థానంలో సుమారు 16 లక్షల మంది ఓటర్లు తనతో ఉన్నారని కేశినేని నాని తెలిపారు.
అదేవిధంగా తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు.
.






