ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ప్రస్తుత అధికార పార్టీగా ఉన్న వైసీపీలో మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే జనసేన వైపు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారని తెలుస్తోంది.నిన్న రాత్రి జనసేనానితో ఆయన రహాస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమని వైసీపీ ఇప్పటికే స్పష్టమైన సమాచారం వచ్చిందని సమాచారం.సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతుల చంటిబాబును కాదని ఈసారి మాజీ మంత్రి తోట నర్సింహను బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుందని సమాచారం.
దీంతో టీడీపీలోకి వెళ్లాలని భావించిన జ్యోతుల చట్టిబాబుకు జ్యోతుల నెహ్రూ నుంచి వ్యతిరేకత వచ్చిందని.ఈ క్రమంలోనే ఆయన జనసేనానితో భేటీ అయ్యారని తెలుస్తోంది.
.






