కాళేశ్వరం ప్రాజెక్టు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ మానస పుత్రికని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు.
ప్రజాధనాన్ని వృధా చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యగా ఉందన్న ఆయన గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయిందని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ కూడా సరిగా లేదని తెలిపారు.అయితే ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ మంత్రులు సందర్శించిన సంగతి తెలిసిందే.
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులు సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు.







