కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాని సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.ఈ క్రమంలోనే కేంద్రం ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరు అందిస్తోందని తెలిపారు.
అలాగే ఆయుష్మాన్ కార్డు ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.కేకే లైన్ ను డబుల్ లైన్ గా మారుస్తామన్నారు.విశాఖ బెనారస్ రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచుతున్నామన్న ఆయన ఏపీకి రూ.8 వేల కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు.