ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళల హర్షం

రాజన్న సిరిసిల్ల జిల్లా :కాంగ్రెస్ పార్టీ( Congress party ) ప్రభుత్వం ఏర్పడ్డాక సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మొదటి విడతలో భాగంగా ఉచిత బస్సును ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం మహిళలు ఉచితంగా బస్సులో ఎక్కించుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.

 Women Rejoice Over Free Bus Travel-TeluguStop.com

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )ఆర్ స్కీముల గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం( Mahalaxmi Scheme ) కింద ఈ బస్సు ప్రయాణాన్ని మహిళలకు ఉచితంగా ఈ రోజు నుండి అందించడం జరుగుతుందన్నారు.

సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ రోజు నుండి పది లక్షలకు పెంచడం జరిగిందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు లింగం గౌడ్,, పసుల కృష్ణ,మండల నాయకులు సూడిది రాజేందర్, రాజు నాయక్ పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube