మీరు జీవితంలో డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ ఎటువంటి పురోగతి కనిపించనప్పుడు, కొన్ని వాస్తు దోషాలు ( Vastu Doshas )కారణమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఈ సమస్యలను దూరం చేసుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
మరి ఆ వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటి ప్రధాన ద్వారం వద్ద చీకటి ఉండటం దురదృష్టకరమని నిపుణులు చెబుతున్నారు.
ఇలా ఉండడం వల్ల మీరు చేసే పనులలో ఆటంకాలు కలుగుతాయి.

అలాగే విరిగిన చిత్రాలు కుటుంబ సంబంధాలలో అసమానతను కలిగిస్తాయని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఇది వివాదాలకు దారి తీస్తుంది.ఈ రకమైన విరిగిన వస్తువులను వీలైనంత త్వరగా ఇంటి నుండి తొలగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే బట్టలు, బూట్లు లేదా ఇతర వస్తువులను ఇంటి చుట్టూ చెల్లాచెదురుగా ఉంచడం అశుభమని నిపుణులు చెబుతున్నారు.లక్ష్మీ దేవి( Goddess Lakshmi ) యొక్క ఈ అసంతృప్తి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి.
రాత్రిపూట తెరిచిన తలుపులు మరియు కిటికీల వల్ల ప్రతికూల శక్తి( Negative energy ) ఇంట్లోకి వస్తుంది.రాత్రి సమయంలో, ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉండటానికి తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచాలి.

వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం, ఇంట్లో పగిలిన అద్దాలు లేదా గాజును ఉంచడం అశుభంగా చెబుతున్నారు.దీనివల్ల ఇంట్లో నుండి పాజిటివ్ ఎనర్జీ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.వంటగది తలుపును ప్రధాన ద్వారం ముందు ఉంచినట్లయితే, అది దక్షిణం, ఆగ్నేయం లేదా నైరుతి వైపు ఉండకూడదు.ఇది దురదృష్టన్ని తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే బాత్రూమ్లు ఇంటికి ఈశాన్యంలో లేదా నైరుతిలో ఉండకూడదు.అలాగే చనిపోయిన మొక్కలను ఇంట్లో ఉంచకూడదు.
ఇంకా చెప్పాలంటే చీపురు ను ఈశాన్య, ఆగ్నేయ లేదా నైరుతి దిశలలో ఉంచడం మంచిది కాదు.అలాగే పాత లేదా విరిగిన చీపురు కట్టలను ఉపయోగించడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
దీనివల్ల ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ( Financial problems )ఎదుర్కోవాల్సి వస్తుంది.





 

