యాదాద్రి భువనగిరి జిల్లా:అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) అమలుకు నోచుకోని హామీలు పక్కన పెట్టి, ప్రజలకు ఉపయోగపడే స్థానిక సమస్యలపై అన్ని పార్టీల అభ్యర్దులు స్థానిక మ్యానిఫెస్టో విడుదల చేయాలని రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ డిమాండ్ చేశారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో( Sansthan Narayanapuram ) ఆయన మాట్లాడుతూ రాచకొండ( Rachakonda ) ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని,గతంలో రాచకొండకు పోవాలంటే గన్నేరుల ప్రాంతం కీలకంగా ఉండేదని,ఇప్పుడది సక్రమంగా లేకపోవడంతో సంస్థాన్ నారాయణపురం నుండి ప్రజలు రాచకొండకు పోవాలంటే చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో గన్నేరుల ప్రాంతం గుండా రాచకొండ గ్రామాలకు వెళ్లే రహదారిని అభివృద్ధి పరిచి రాచకొండ తూర్పు భాగం నుండి వెళ్లే గ్రామాల వారికి అనువుగా నిర్మించాలని కోరారు.







