తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన బాధ్యత యువతదేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పై తీవ్రంగా మండిపడ్డారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని బీఆర్ఎస్ నేతలు చెప్పారన్న రేవంత్ రెడ్డి ఏ రోజు కొడంగల్ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.ఐదేళ్లలో కొడంగల్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని చెప్పారు.
కొడంగల్ కు కృష్ణానది నీళ్లు తీసుకొస్తామని మోసం చేశారని మండిపడ్డారు.కొడంగల్ నియోజకవర్గానికి నిధులు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే కొడంగల్ కు రమ్మని కేసీఆర్ కు సవాల్ చేసినట్లు తెలిపారు.కొడంగల్ కు ఏం చేయని వాళ్లు మళ్లీ ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు.







