రేపటి నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఇందులో భాగంగా రేపటి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

 Revanth Reddy Election Campaign In Telangana From Tomorrow-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.ఈ క్రమంలో ముందుగా రేపు అలంపూర్ జోగులాంబ ఆలయంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

పూజల అనంతరం అలంపూర్, గద్వాల్, మక్తల్ లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.అదేవిధంగా ఎల్లుండి ఖానాపూర్, ఆదిలాబాద్ మరియు రాజేంద్రనగర్ లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

ఈనెల 9న పాలకుర్తి, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్ లో సభలను ఏర్పాటు చేయనున్నారు.అదే రోజున కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించనుంది.ఈనెల10వ తేదీన జహీరాబాద్, కామారెడ్డిలో జరిగే ఎన్నికల ప్రచారానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాజరుకానున్నారు.అదే రోజు కామారెడ్డి సభా వేదికపై నుంచి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube