రాజన్న సిరిసిల్ల జిల్లా: పల్లె వెలుగు బస్సులు పటిక బెల్లం పట్టివేత.పెద్దమ్మ స్టేజ్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న పోలీసులు.
కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 15 కేజీల పటిక బెల్లం ను పోలీస్ లు శనివారం సాయంత్రం గంభిరావు పేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద పట్టుకున్నారు.
పటిక బెల్లం ఎవరిదో బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్పకపోవడంతో దానిని చెక్ పోస్ట్ వద్దకు తెచ్చారు.
ఆ విషయాన్ని పోలీస్ లు అప్పటికే అక్కడ ఉన్న ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి తెలియజేశారు.వ్యయ పరిశీలకుల సూచనలతో పట్టుకున్న బెల్లం ను సీజ్ చేశారు.