టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.ఆధారాలు ఉండటంతోనే అధికారులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు నమ్మలేదని మంత్రి అంబటి తెలిపారు.నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఉన్నతస్థాయి విచారణకు సిద్దంగా ఉన్నారా అని ప్రశ్నించారు.
కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని సైతం చంద్రబాబు ప్రజల కోసం పక్కన పెట్టారంటున్నారు.మరీ ఏ అర్హత ఉందని లోకేశ్ ను మంత్రిగా చేసి మూడు శాఖలను అప్పగించారని నిలదీశారు.
ఇది కుటుంబ స్వార్థం కాదా అని ప్రశ్నించారు.నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని తెలిపారు.







