తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది.ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ లో స్క్రీనింగ్ కమిటీ సమావేశంకానుంది.
ఇప్పటికే 55 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది కాంగ్రెస్.ఈ క్రమంలోనే మిగతా 64 స్థానాల అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో కమిటీ చర్చించనుంది.
వివాదం లేని సీట్లతో పాటు వామపక్షాలతో పొత్తుపై కూడా కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు.అయితే కొత్తగూడెం, వైరా, మిర్యాలగూడ సీట్లను వామపక్ష పార్టీ నేతలు అడుగుతున్న సంగతి తెలిసిందే.
అదేవిధంగా దసరా పండుగ తరువాత పార్టీలో చేరే వారికి సీట్లు కేటాయించాల్సి ఉన్నందున వారికి తుది జాబితాలో చోటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.







