ఏపీలోని టీడీపీ నేతలపై మంత్రి జోగి రమేశ్ సీరియస్ అయ్యారు.చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెప్తున్నారు కానీ చంద్రబాబు అవినీతిపరుడని చెప్పారు.
టీడీపీ నేతలు కావాలనే తమ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు.అయితే చంద్రబాబు అరెస్టును రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.
ఏపీలో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేదలకు ఏనాడైనా చంద్రబాబు మద్ధతు ఇచ్చారా అని ప్రశ్నించారు.ఏపీ ప్రజలు జగన్ వైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు.







