భార్యను హత్య చేసి, ఆమె అన్నకు ఫోన్ చేసి కనిపించడం లేదంటూ..?

ఆ కుటుంబంలో తరచూ భార్యాభర్తల ( Husband and wife )మధ్య గొడవలే.గ్రామ పెద్దలు, కుటుంబ పెద్దలు ఎన్నోసార్లు సర్ది చెప్పి ఆ దంపతులను సంసారానికి పంపించేవారు.

 He Killed His Wife And Called Her Brother And Did Not Appear , Husband And Wife-TeluguStop.com

అయినా కూడా ఆ భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది.ఈ క్రమంలోని భార్య గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా.

ఆమె అన్నకు ఫోన్ చేసి మీ చెల్లెలు కనిపించడం లేదని చెప్పిన ఘటన మహబూబ్ నగర్ ( Mahbub Nagar )లో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.ధరూరు మండలం( Dharur mandal ) మన్నాపురానికి చెందిన పవిత్ర (23) కు ఇర్కిచేడు కు చెందిన నాగేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది.గత సంవత్సర కాలంగా ఈ భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి.

గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ఎన్నోసార్లు సర్ది చెప్పి ఈ దంపతులను సంసారానికి పంపించేవారు.

అయినా కూడా ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో గురువారం కూడా ఈ దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది.

దీంతో భార్య గొంతు నులిమి హత్య చేశాడు.హత్య అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో ఉండే వ్యవసాయ పొలంలో పడేశాడు.

ఆ తర్వాత భార్య అన్నకు ఫోన్ చేసి మీ చెల్లెలు కనిపించడం లేదని తెలిపాడు.

పవిత్ర కుటుంబ సభ్యులు గ్రామానికి వచ్చి గాలించగా శుక్రవారం మృత దేహం ( Dead body )బయటపడింది.వెంటనే కేటీ దొడ్డి పోలీసులకు సమాచారం అందించగా.గద్వాల డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరి మృతదేహాన్ని పరిశీలించారు.

మృతురాలి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube