తెలంగాణలో వైసీపీ పోటీపై ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో పోటీ చేసే ఆలోచన, ఉద్దేశం లేవని తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో ప్రతిపాదించిన విధంగా ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాలు జరిగాయని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.సీఎం జగన్ కేంద్రానికి అన్ని అంశాలు వివరించారని తెలిపారు.
కృష్ణా జలాలపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు.అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు.
జనసేన, టీడీపీతో పాటు ఎన్ని పార్టీలు కలిసి పని చేసినా వైసీపీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







