హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద సెకండ్ ఏఎన్ఎం ఆందోళన ఉద్రిక్తంగా మారింది.తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఛలో సెక్రటేరియట్ పేరుతో నిరసనకు దిగారు.
ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు సెకండ్ ఏఎన్ఎం సభ్యులను అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దీంతో ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.సెకండ్ ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని, వయో పరిమితి సడలించడంతో పాటు తమ పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.







