హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది.పురానాపూల్ బ్రిడ్జి దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనదారుడి వద్ద నగదును పట్టుకున్నారు.
అనుమానాస్పద వ్యక్తి దగ్గర సుమారు రూ.18 లక్షల నగదు లభ్యం అయింది.ఈ క్రమంలోనే పోలీసులు అడిగిన ప్రశ్నలకు రోహిత్ అనే వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.హమీదుల్లా ఖాన్ అనే వ్యక్తి దగ్గర కలెక్షన్ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు రోహిత్ వెల్లడించాడు.రోహిత్ ఇచ్చిన సమాచారంతో ముషీరాబాద్ స్క్రాప్ దుకాణంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు మొత్తం రూ.35 లక్షల 50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.సరైన లెక్కలు చూపించకపోవడంతో పోలీసులు నగదును సీజ్ చేశారు.