హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదు..: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేటలో వెయ్యి పడకల ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.పదేళ్లలో వంద పడకల ఆస్పత్రి వెయ్యి పడకల ఆస్పత్రిగా మారిందని తెలిపారు.

 No Need To Go To Hyderabad..: Minister Harish Rao-TeluguStop.com

హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఉన్న సేవలు సిద్ధిపేటలోనూ అందుబాటులోకి వచ్చాయని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.ఐదో అంతస్తులో 15 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.అదేవిధంగా వంద ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.30 పడకల ఎమర్జెన్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.ఇకపై వైద్య సేవల కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.ఈ క్రమంలోనే వైద్య వ్యవస్థలో తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం విప్లవం సృష్టించిందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube